జీతాలివ్వని సంస్థపై చర్యలు ఉండవ్: కర్ణాటక
ABN, First Publish Date - 2020-05-10T01:59:04+05:30
కరోనా సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న తమను ఆదుకోవాలని కోరుతూ పరిశ్రమలు సంఘాలు కర్ణాటక ప్రభుత్వంతో సమావేశమయ్యాయి. కార్మిక చట్టాల అమలుకు సంబంధించి కంపెనీలకు కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరాయి.
బెంగళూరు: కరోనా సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న తమను ఆదుకోవాలని కోరుతూ పరిశ్రమలు సంఘాలు కర్ణాటక ప్రభుత్వంతో సమావేశమయ్యాయి. కార్మిక చట్టాల అమలుకు సంబంధించి కంపెనీలకు కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరాయి. రాష్ట్ర లేబర్ సెక్రెటరీ కెప్టెన్ మణివణ్ణన్తో కాన్ఫఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్తో పాటూ అనేక సంస్థలు ఈ విషయాలపై చర్చించాయి. ఈ సందర్భంగా కార్మీకుల తొలగింపు, జీతాల చెల్లింపు వంచి అంశాలు చర్చకు వచ్చాయి. కంపెనీల కార్మికులకు జీతాలు చెల్లించలేని పక్షంలో ఏటువంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందోనంటూ పారిశ్రామిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
దీనిపై స్పందించిన మణివణ్ణన్.. ఏప్రిల్ నెలలో కార్మికులకు జీతాలు చెల్లించని సంస్థలకు ప్రభుత్వం ఎటువంటి నోటీసులు జారీ చేయదని భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఒక వేళ ఎవరైన ఫిర్యాదు చేసినప్పటికీ, కంపెనీ ఆర్థిక స్థితిని తొలుత పరిసీలిస్తామని వీలైతే జీతాలు విడుదల చేయాలని చెబుతామన్నారు. తమకు అంత శక్తి లేదని కంపెనీలు చేతులెత్తే.. విషయం అక్కడితోనే ముగుస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇక కరోనా కారణంగా కోల్పోయిన కాలాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగుల పనివేళలను కూడా పేంచే అవకాశం ఉందా అని ప్రభుత్వాన్ని ఆయా సంఘాలు ప్రశ్నించినట్టు సమాచారం.
Updated Date - 2020-05-10T01:59:04+05:30 IST