ఎంపీ ల్యాడ్స్ నుంచి కేంద్ర మంత్రి రూ.కోటి విరాళం
ABN, First Publish Date - 2020-03-28T23:43:00+05:30
కరోనా వైరస్పై పోరాటానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ మొత్తాన్ని..
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరాటానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ మొత్తాన్ని ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్)కు అందజేశారు. 'ఇప్పుడే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశాను. కరోనా వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ఎంపీలంతా ఎంపీ ల్యాడ్స్ నుంచి పీఎంఎన్ఆర్ఎఫ్కు విరాళం ఇవ్వాలని ప్రధాని పిలుపు మేరకు ఈ మొత్తం డిపాజిట్ చేశాను' అని కిరిణ్ రిజిజు ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
కోవిడ్-19పై ప్రభుత్వ పోరాటానికి మరింత బలం చేకూర్చేందుకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఒక నెల వేతనాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్కు శుక్రవారంనాడు విరాళంగా ప్రకటించారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శనివారానికి 873కు చేరింది. 78 మంది పేషెంట్లను వ్యాధి నయం కావడంతో డిశ్చార్చ్ చేశారు.
Updated Date - 2020-03-28T23:43:00+05:30 IST