ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పళ్లాలు మోగించి 'మన్ కీ బాత్' చాటిన రైతన్న

ABN, First Publish Date - 2020-12-28T00:54:03+05:30

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుకో రీతిలో నిరసన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న రైతులు ఆదివారంనాడు మోదీ 'మన్ కీ బాత్' సమయంలో వినూత్న నిరసన తెలిపారు. రైతుల మనసులో మాట వినండంటూ ప్రధాని ప్రసంగం చేస్తున్నంత సేపూ  భోజనం పళ్లాలను మోగించి నిరసన తెలిపారు. తద్వారా మోదీ మనసులో మాట తమకు చేరలేదనే సందేశం పంపారు.


ప్రతి నెలా చివరి ఆదివారంనాడు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడారు. ఇదే సమయంలో, ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు వంటపాత్రలు, అన్నం కంచాలపై దరువులు వేశారు. ప్రధాని సందేశం తమకు చేరలేదనే సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మనసులో మాట వినివినీ అలసిపోయాయమని, ఇకనైనా తమ గోడు వినాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. కరోనా తొలినాళ్లలో పళ్లాలు మోగించి, చప్పుళ్లతో నిరసన తెలపాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. రైతులు ఇప్పుడు అదే తరహాలో  వంటపాత్రలు మోగించి రైతు గుండె చప్పుళ్లు వినాలంటూ సందేశం పంపారు.

Updated Date - 2020-12-28T00:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising