భారత్ నుంచి యూకేకి 30 లక్షల యూనిట్ల పారాసిటమాల్
ABN, First Publish Date - 2020-04-16T00:09:20+05:30
భారత్ నుంచి 30 లక్షల పారాసిటమాల్ యూనిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు యూకే విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో..
లండన్: భారత్ నుంచి 30 లక్షల పారాసిటమాల్ యూనిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు యూకే విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో ఈ మేరకు చర్చలు జరిపినట్టు ట్విటర్ వేదికగా ప్రకటించింది. ‘‘భారత్తో చర్చల దరిమిలా అక్కడి నుండి యునైటెడ్ కింగ్డమ్ 3 మిలియన్ల పారాసిటమాల్ యూనిట్లు అందుకోనుంది. రెండు వారాల్లో ఇవి వస్తాయి. యూకేలోని అన్ని ప్రముఖ సూపర్ మార్కెట్లలో వీటిని అందుబాటులో ఉంచుతాం..’’ అని యూకే విదేశాంగ, కామన్వెల్త్ కార్యాలయం ఓ ట్వీట్లో పేర్కొంది. యూకేలో ఇప్పటి వరకు 90 వేలకు పైగా కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్తో పోరాడుతున్న పలు దేశాల అభ్యర్థన మేరకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Updated Date - 2020-04-16T00:09:20+05:30 IST