ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘోరాతిఘోరం.. మనుషుల నిర్లక్ష్యానికి 4వేల మూగ జీవాలు బలి

ABN, First Publish Date - 2020-10-03T11:46:30+05:30

చైనాలో దారుణం జరిగింది. ఓ షిప్పింగ్‌ కంపెనీ నిర్లక్ష్యం నాలుగు వేల మూగ జీవాలను బలితీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, అక్టోబరు 2: చైనాలో దారుణం జరిగింది. ఓ షిప్పింగ్‌ కంపెనీ నిర్లక్ష్యం నాలుగు వేల మూగ జీవాలను బలితీసుకుంది. ఈ ఘటన స్థానిక హెనాన్‌ ప్రావిన్స్‌లోని లౌహే నగరంలో జరిగింది. వారం క్రితం చైనా జంతు పరిశ్రమ.. 5 వేల కుక్కలు, పిల్లులు, కుందేళ్లు లాంటి పెంపుడు జంతువులను ప్లాస్టిక్‌, కార్డ్‌బోర్డ్‌ పెట్టెల్లో పార్శిల్‌ చేసి డాంగ్జిం గ్‌ లాజిస్టిక్స్‌కు పంపించింది. వీటిని చైనీయులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. డాంగ్జింగ్‌ సంస్థ వాటిని సకాలంలో డెలివరీ చేసున్నా.. అందులో మూగజీవాలున్నట్లు ఆ షిప్పింగ్‌ సంస్థకు జంతు పరిశ్రమ సమాచారం అందించి ఉన్నా.. పా పం వాటి ప్రాణాలు నిలబడి ఉండేవి. డెలివరీలో జరిగిన జాప్యంతో.. వారం పాటు ఆ పార్శిళ్లు షిప్పింగ్‌ సంస్థలోనే ఉం డిపోయాయి. దీంతో.. తిండిలేక.. ఊపిరాడక.. విలవిల్లాడిపోయిన ఆ మూగ జీవాలు.. మనుషుల నిర్లక్ష్యం సాక్షిగా ప్రాణాలు విడిచాయి. 

Updated Date - 2020-10-03T11:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising