ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన ఐదో విడత ‘వందే భారత్ మిషన్’.. 23దేశాలకు ప్రత్యేక విమానాలు!

ABN, First Publish Date - 2020-08-01T21:26:17+05:30

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఓ మీడియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన  ఆయన.. ఈ రోజు (ఆగస్ట్ 1) నుంచి ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైందన్నారు. ఆగస్ట్ 31 వరకు ‘వందే భారత్ మిషన్’ 5వ దశ కొనసాగుతుందని వెల్లడించారు. ఐదో విడత ‘వందే భారత్ మిషన్’లో భాగంగా.. గల్ఫ్ దేశాలు, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, చైనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు 8.45లక్షల మందిపైగా భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ విమానాల్లో 2.67లక్షల మంది భారత్ చేరుకోగా.. చార్టెడ్ విమానాల్లో 4.86లక్షల మంది ఇండియాకు వచ్చినట్లు వెల్లడించారు. నేపాల్, పాకిస్థాన్, భూటన్ తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయులు రోడ్డు మార్గం ద్వారా స్వదేశానికి వచ్చినట్లు వివరించారు. 


Updated Date - 2020-08-01T21:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising