ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఎంత మంది ఇండియాకు చేరారంటే..!

ABN, First Publish Date - 2020-06-25T05:30:00+05:30

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ కొనసా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మే 7 నుంచి ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమవగా.. ఇప్పటి వరకు 3.64లక్షల మంది ఈ మిషన్‌లో భాగంగా ఇండియాకు చేరుకున్నారని తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు దాదాపు 5.13లక్షల మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లో చిక్కుకున్న వారిని రోడ్డు మార్గం ద్వారా ఇండియాకు తరలించినట్లు ఆయన వివరించారు. రోడ్డు మార్గాల ద్వారా ఇప్పటి వరకు 84వేల మంది భారత్ చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘వందే భారత్ మిషన్’ మూడు దశల్లో కలిపి 50 దేశాలకు 875 ప్రత్యేక విమానాలను నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising