పాయింట్ల పద్ధతి హాస్యాస్పదం
ABN, First Publish Date - 2020-05-04T10:09:36+05:30
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షి్పనకు సంబంధించిన పాయింట్ల విధానాన్ని విండీస్ దిగ్గజ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ తప్పుపట్టాడు...
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షి్పనకు సంబంధించిన పాయింట్ల విధానాన్ని విండీస్ దిగ్గజ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ తప్పుపట్టాడు. దీనిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గత ఆగస్టులో ప్రారంభమైన ఈ టెస్టు చాంపియన్షి్పలో టాప్-2 జట్లు 2021, జూన్లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇందులో భాగంగా జరిగే ఒక్కో సిరీస్కు 120 పాయింట్లు కేటాయించారు. ఒకవేళ ఐదు టెస్టులు ఆడితే మ్యాచ్కు 24, రెండు టెస్టుల సిరీ్సలో ఒక్కో మ్యాచ్కు 60 పాయింట్లుగా ఉంటోంది. అసలు ఈ పద్ధతే హాస్యాస్పదంగా ఉందని హోల్డింగ్ అన్నాడు.
Updated Date - 2020-05-04T10:09:36+05:30 IST