ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ABN, First Publish Date - 2020-08-18T06:52:08+05:30

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు7 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 20

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 20 రోజులపాటు వర్షాకాల సమావేశాల నిర్వహణ
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం


అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు7 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 20 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ పలువురు మంత్రులతో సోమవారం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని కేసీఆర్‌, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు. ఈ సమావేశాలకు సిద్థం కావాలని మంత్రులు, అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2020-08-18T06:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising