ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తుగా సునామీలను పసిగట్టగలం

ABN, First Publish Date - 2020-12-26T08:40:12+05:30

పెద్ద ఎత్తున ప్రాణాలను హరించే సునామీలను ముందస్తుగా పసిగట్టి ప్రభుత్వాలు, ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధానమని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా పురోగతి సాధించామని చెప్పారు. హిందూ మహా సముద్ర తీర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం

2004 భయంకర సునామీకి 16 ఏళ్లు: ఇన్‌కాయిస్‌


హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెద్ద ఎత్తున ప్రాణాలను హరించే సునామీలను ముందస్తుగా పసిగట్టి ప్రభుత్వాలు, ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధానమని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా పురోగతి సాధించామని చెప్పారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబరు 26న సంభవించిన అతి భయంకర ‘సుమత్ర’ సునామీకి శనివారంతో 16 ఏళ్లు పూర్తవుతాయని వివరించారు. ఈ సునామీ తర్వాత 2007 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఇన్‌కాయి్‌సలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్‌ సునామీ అర్లీ వార్నింగ్‌ సిస్టం(ఐటీఈడబ్ల్యూఎస్‌) కేంద్రం ద్వారా  మహాసముద్రంలో సునామీ సంబంధ భూకంపాలను కచ్చితమైన సమయంలో అంచనా వేసి ప్రభుత్వాలకు సమాచారమిస్తున్నామని చెప్పారు. భూకంపాలకు 10 నిమిషాల ముందుగానే ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌, ఫ్యాక్స్‌, జీటీఎస్‌ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఇతర 25 దేశాలకు కూడా సమాచారాన్ని పంపిస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-26T08:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising