ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు
ABN, First Publish Date - 2020-09-13T06:23:06+05:30
హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2019లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) మంజూరుకు ఓ ప్రైవేటు కంపెనీ డైరక్టర్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసినందుకు ఈ కే సు నమోదైంది.
హైదరాబాద్ జీఎస్టీలో అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్(యాంటీ ఏవియేషన్) చిలక సుధారాణి, సూపరింటెండెంట్ శ్రీనివాస గాంధీ బొల్లినేనిపై ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి సమాచారం అందింది. రూ.10 లక్షలు నగదు తీసుకుని మిగతా మొత్తానికి ఖాళీ స్థలాలు, ప్లాట్లు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. శ్రీనివాసగాంధీ, సుధారాణిపై అఽధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-13T06:23:06+05:30 IST