ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే.. ఎందుకు స్పందించట్లేదు?: చాడ

ABN, First Publish Date - 2020-05-11T21:31:23+05:30

హైదరాబాద్: వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. నేడు మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. నేడు మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాడ మాట్లాడుతూ.. అసంఘటితరంగ కార్మికులకు సహాయం చేయాలన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదల బతుకులు భారంగా మారాయన్నారు. నీళ్ల కోసం తెలంగాణ పోరాటం సాగిందని.. కానీ సరైన జల విధానం లేదని చాడ విమర్శించారు. 


పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే... తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జీవో 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు రక్షణలు కల్పించబడ్డాయన్నారు. జీవో 3 వచ్చాక ఏజెన్సీ ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగిందన్నారు. జీవో 3ని సుప్రీంకోర్టు కొట్టేయడంపై ఏపీ, తెలంగాణ అప్పీల్‌కు వెళ్లాలన్నారు. ఆర్డినెన్స్‌ తెచ్చి ఏజెన్సీ ప్రజలకు నమ్మకం కలిగించాలని చాడ వెంకటరెడ్డి కోరారు.

Updated Date - 2020-05-11T21:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising