ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్నల్ సంతోష్ కుటుంబానికి కేంద్రం అండగా ఉంటుంది: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-22T00:17:19+05:30

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ సేవలను ఆయన కొనియాడారు. సంతోష్, తల్లిదండ్రులను, భార్యను కిషన్‌రెడ్డి ఓదార్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ సేవలను ఆయన కొనియాడారు. ప్రధాని మోడీ ఆదేశాలతో కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించానని ఆయన చెప్పారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికి కాకుండా దేశానికి , సైన్యానికి తీరని నష్టమన్నారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందని, చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-22T00:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising