హైదరాబాద్లో డ్రై డేను నిర్వహించిన జీహెచ్ఎంసీ
ABN, First Publish Date - 2020-06-22T00:04:12+05:30
నగరంలో జీహెచ్ఎంసీ డ్రై డేను నిర్వహించింది. కూకట్పల్లిలో దోమ వేషంతో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. అంతేకాదు పలు కాలనీలతో పాటు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద దోమ వేశంలో అవగాహన కల్పించారు.
హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ డ్రై డేను నిర్వహించింది. కూకట్పల్లిలో దోమ వేషంతో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. అంతేకాదు పలు కాలనీలతో పాటు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద దోమ వేశంలో అవగాహన కల్పించారు. ఇల్లు, పరిసరాలను శుభ్రoగా ఉంచుకోవాలని సూచించారు. పూలకుండీలు, డ్రమ్ములు, ట్యాంకులలో నిల్వ వున్న నీటిని తొలగించుకోవాలని చెప్పారు. ట్యాంకులలో నిల్వ వున్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పైకప్పులు, పనికిరాని ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, టైర్లలో నిలిచివున్న నీటిని తొలగించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని నియంత్రణ విజయవంతం అవుతుందని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-06-22T00:04:12+05:30 IST