‘సిద్దిపేట’ కోసం ఇంత ప్రజాధనమా?: ఎర్ర
ABN, First Publish Date - 2020-05-30T08:36:59+05:30
‘సిద్దిపేట’ కోసం ఇంత ప్రజాధనమా?: ఎర్ర
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాకు సాగునీరు అందించడానికి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అవసరమా అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. 240 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకొచ్చి, 618 మీటర్ల ఎత్తున కొండపోచమ్మ రిజర్వాయర్ను ఏర్పాటు చేసిన తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.
Updated Date - 2020-05-30T08:36:59+05:30 IST