ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రుల మరణం.. కరోనా వల్ల పనుల్లేక.. చెల్లి పెళ్లి ఎలా చేయాలన్న బాధతో..

ABN, First Publish Date - 2020-08-18T18:57:32+05:30

ఆర్థిక భారం, కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్‌బీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక భారంతో ఊరేసుకున్న యువకుడు


మన్సూరాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక భారం, కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్‌బీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం రెండ్లగూడ గ్రామానికి చెందిన శనిగరపు నరేష్‌ (22) మన్సూరాబాద్‌లోని మణికంఠ హోం కేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. పక్కనే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే చనిపోయారు. అతడి చెల్లెలిని గ్రామంలోని పెద్దనాన్న ఇంట్లో ఉంచాడు. లాక్‌డౌన్‌ తరువాత అతడికి సరిగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 


చెల్లెలి పెళ్లి ఎలా చేయాలన్న విషయంపై నిత్యం బాధపడేవాడు. సొంత ఊరికి వెళదామని ఆదివారం ఇంటి నుంచి బయలుదేరాడు. కరోనా వల్ల ఇప్పుడు రావొద్దని అతడి పెద్దనాన్న కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తిరిగి హోం కేర్‌ సెంటర్‌కు వచ్చాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు డోర్‌ కర్టెన్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోం కేర్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఆదివారం రాత్రి వచ్చి చూడగా ఉరేసుకున్న నరే్‌షను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-18T18:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising