బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం
ABN, First Publish Date - 2020-10-03T09:22:01+05:30
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో రూ. 37 కోట్ల జరిమానా వసూలు ...
12 ఏళ్లలో రూ.37 కోట్ల జరిమానా వసూలు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో రూ. 37 కోట్ల జరిమానా వసూలు చేసింది. కోప్టా చట్టం ప్రకారం బహిరంగ ధూమపానం నిషేధం. ఈ ఏడాది జూన్ వరకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన 26,16,050 మంది నుంచి రూ. 37,33,64,148 జరిమానా వసూలు చేసింది. కార్పొరేట్ సంస్థలు, కొన్ని కార్యాలయాలు, హోటళ్లు, బార్లు, క్లబ్లులు, ఎయిర్పోర్ట్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన స్మోకింగ్ రూమ్ల ద్వారా కొవిడ్ ప్రబలే ప్రమాదం ఉందని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్మోకింగ్ రూమ్లను నిషేధించాలని డిమాండ్ చేసింది.
Updated Date - 2020-10-03T09:22:01+05:30 IST