నర్సరీల్లో కూలీల సంఖ్య పెంచాలి
ABN, First Publish Date - 2020-03-12T11:40:39+05:30
తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహరం కార్యక్ర మం విజయవంతం చేసేందుకు ప్రతి గ్రా మంలో నర్సరీని ఏర్పాటు చేసిందని, నర్సరీల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా పంచాయ తీ శాఖ అధికారి సుదర్శన్ అన్నారు.
ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలి
ఇంటిపన్నులు వందశాతం వసూలు చేయాలి
జిల్లా పంచాయతీ శాఖ అధికారి సుదర్శన్
పెద్దపల్లి రూరల్, మార్చి 11 : తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహరం కార్యక్ర మం విజయవంతం చేసేందుకు ప్రతి గ్రా మంలో నర్సరీని ఏర్పాటు చేసిందని, నర్సరీల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా పంచాయ తీ శాఖ అధికారి సుదర్శన్ అన్నారు. బుధవా రం పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. ఈ సం దర్భంగా కూలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నర్సరీల్లో పెంచాల్సిన ప్రతి మొక్కను రక్షించాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రికా ర్డులను పరిశీలించారు. వందశాతం ఇంటిప న్నులు వసూలుచేయాలని, గ్రామానికి కేటా యించిన ట్రాక్టర్ వినియోగాలను రోజువారిగా రికార్డుల్లో రాయాలన్నారు. మొక్కల రక్షణకు ట్రాక్టర్ను వినియోగించాలని, ఎక్కడా చెత్తచె దారం కనిపించకుండా రోజువారిగా శుభ్రం చేయాలన్నారు. వారి వెంట డీఎల్పీవో దేవకీ దేవి, పంచాయతి కార్యదర్శి శ్రావణ్, పీల్డ్అసి స్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సరీల బాధ్యత కార్యదర్శులదే... జడ్పీ సీఈవో వినోద్కుమార్
ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో దిగడంతో ఈజీఎస్ పనుల పరిశీలన, నర్సరీల్లో మొక్కల పెంపకం వంటి వాటిని పంచాయతీ కార్యద ర్శులే బాధ్యత తీసుకోవాలని జడ్పీ సీఈవో వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండ లంలోని కుర్మపల్లి గ్రామంలో గల నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే మొక్కలను విరివిగా పెంచా లని, ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉండటంతో నర్సరీలకు రోజూ ఉదయాన్నే పంచాయతీ కార్యదర్శులు విధిగా హాజరుకావాలని ఆదేశిం చారు. ఉపాధి కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలన్నారు. వారి వెంట సర్పంచ్ మామిడిపల్లి బాప న్న, ఎంపీడీవో రాజు, ఏపీవో మల్లీశ్వరిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-12T11:40:39+05:30 IST