ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై రేపు సీఎం కేసీఆర్ అత్యున్నత సమావేశం

ABN, First Publish Date - 2020-03-19T02:15:25+05:30

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి, మహమూద్‌అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డిలతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు ఆహ్వానం అందింది. అంతే కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి, మహమూద్‌అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డిలతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు ఆహ్వానం అందింది. అంతే కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు కేసీఆర్‌ ఆహ్వానం అందించారని సీఎంవో తెలిపింది. కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులపై నేతలు చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవాలని అన్నారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

Updated Date - 2020-03-19T02:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising