మానవ హక్కుల కోసం పోరాడాలి
ABN, First Publish Date - 2020-12-11T04:53:08+05:30
మానవ హక్కుల కోసం ప్రతిఒక్కరం పోరాడాలని 4వ అదనపు జిల్లా జడ్జి సీవీఎ్స.సాయిభూపతి అన్నారు.
4వ అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి
సత్తుపల్లి, డిసెంబరు 10: మానవ హక్కుల కోసం ప్రతిఒక్కరం పోరాడాలని 4వ అదనపు జిల్లా జడ్జి సీవీఎ్స.సాయిభూపతి అన్నారు. గురువారం హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రేపు రెండో శనివారం 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశమంతా కరోనాపై పోరాటం చేస్తుందని, అందుకే మనమంతా మాస్క్లు ధరిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. గొప్ప బీద తేడాలేదని, మాట్లాడే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా వ్యాపారం, ఉద్యోగం చేసే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కే.యువరాజాతో పాటు న్యాయవాదులు లక్ష్మణరావు, అబ్దుల్పాషా, కూకలకుంట రవి, వంకదారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T04:53:08+05:30 IST