పారదర్శకత కోసమే కొత్త చట్టం
ABN, First Publish Date - 2020-09-13T09:54:43+05:30
రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభు త్వం చట్టం తీసుకొచ్చిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు.
లావుడ్యా రాములునాయక్
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
జూలూరుపాడు, సెప్టెంబరు 12: రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభు త్వం చట్టం తీసుకొచ్చిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూలూరుపాడు మండలంలోని 56 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.54,83,264 చెక్కులు, ఏన్కూరు మండలంలో 10 మందికి రూ. 1,90,857ల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణియాప్లో భూముల వివరాలను పొందుపరుస్తామన్నారు. ఇటీవల మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పీఎల్ఎన్ ప్రసాద్, మార్క్ఫెడ్ రాష్ట్ర వై్స చైర్మన్ బొర్రా రాజశేఖర్, సొసైటీ అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపిటీసీలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరి మధుసుదన్రావు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-13T09:54:43+05:30 IST