ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో ఎర్రబెల్లి వాహన పూజ

ABN, First Publish Date - 2020-07-05T07:07:11+05:30

యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనానికి పూజలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆంక్షలున్నా పట్టించుకోని అధికారులు

యాదాద్రి, జూలై 4(ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనానికి పూజలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కరోనా ఆంక్షలను పక్కన బెట్టి మంత్రి వాహనానికి పూజలు నిర్వహించడం విమర్శలకు దారితీయడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహన పూజలను ప్రారంభిస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం ప్రభుత్వం పలు ఆంక్షల నడుమ ఆలయాల్లో దర్శనాలను ప్రారంభించింది. స్వామివారి కల్యాణం, హోమ పూజలు, జోడిసేవలు, అభిషేకం, అర్చనల వంటి ఆర్జిత సేవలతోపాటు వాహన పూజలపై ఆంక్షలు విధించింది.


అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త వాహనానికి ఆలయ వాహన పూజల షెడ్డులో మంత్రి సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. శనివారం నుంచి వాహన పూజలకు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతి ఇచ్చారని, ఈమేరకు పూజలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2020-07-05T07:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising