ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిటికెడు ఉప్పేసి పప్పంతా మాదే అంటే ఎలా?

ABN, First Publish Date - 2020-09-24T09:07:10+05:30

ఏ రాత్రైనా తన ఇంటి తలుపు తడితే కదిలొచ్చి వెన్నంటి ఉంటానని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ గల్లంతవ్వాలి

ఏ రాత్రైనా నా ఇంటి తలుపు తడితే కదిలొస్తా: హరీశ్‌


దుబ్బాక/చేగుంట, సెప్టెంబరు 23: ఏ రాత్రైనా తన ఇంటి తలుపు తడితే కదిలొచ్చి వెన్నంటి ఉంటానని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిటికెడు ఉప్పు వేసి పప్పంతా తమదే అన్న చందంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పింఛన్‌దారులకు రూ.11,700 కోట్లను అందిస్తుంటే, కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని తెలిపారు. అయితే ఆ మొత్తం నిధులను కేంద్రమే ఇస్తున్నట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి కూడవెల్లిలో నిర్వహించిన రేషన్‌ డీలర్ల సమావేశంలో, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాల్లో రైతులకు నూతన పట్టా పాస్‌బుక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆదుకోవాల్సిన కేంద్రం.. వ్యవసాయ బిల్లులు తెచ్చి అన్నదాతల నడ్డివిరుస్తున్నదన్నారు.  విదేశాల నుంచి మొక్కజొన్నలు దిగుమతి చేసుకొని కోళ్ల దాణాకు ఉపయోగిస్తామని కేంద్రం చెబుతోందని, స్థానికంగా పండించిన మక్కలు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్కలే గోదాముల్లో మగ్గుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising