నిర్వాసితులు ఆందోళన చెందవద్దు- పువ్వాడ
ABN, First Publish Date - 2020-08-16T23:29:18+05:30
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మున్నేరు ప్రవహిస్తున్న కాల్వ ఒడ్డు, పరివాహక ప్రాంత వాసులకు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వసతి కేంద్రాలను అదికారులు ఏర్పాటుచేశారు.
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మున్నేరు ప్రవహిస్తున్న కాల్వ ఒడ్డు, పరివాహక ప్రాంత వాసులకు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వసతి కేంద్రాలను అదికారులు ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సందర్శించారు. ముంపు ప్రాంత నిర్వాసితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చింది. అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం మున్నేరు ఉధృతిని మంత్రి పరిశీలించారు. మున్నేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్న నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వఇ కర్ణన్కు సూచించారు.
Updated Date - 2020-08-16T23:29:18+05:30 IST