ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-06-19T07:37:18+05:30

రూర్బన్‌ పథకం కింద కొండ భీమనపల్లి క్లస్టర్‌లో వివిధ శాఖలతో చేపట్టిన పెండింగ్‌ పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, జూన్‌ 18 : రూర్బన్‌ పథకం కింద కొండ భీమనపల్లి క్లస్టర్‌లో వివిధ శాఖలతో చేపట్టిన పెండింగ్‌ పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో నేషనల్‌ రూర్బన్‌ పథకం పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో రూర్బన్‌ క్రిటికల్‌ గ్యాబ్‌ నిధులతో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పెండింగ్‌ పను లు మార్చి 2021లోగా పూర్తి చేయాలన్నారు. స మావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, డీపీవో విష్ణువర్దన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణ య్య, మత్స్యశాఖ అధికా చరిత, పంచాయతీరాజ్‌ ఈఈలు మాధవి, తిరుపతయ్య పాల్గొన్నారు. 


పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

నల్లగొండ రూరల్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో పల్లె ప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠదామాల నిర్మాణం, డంప్‌ యార్డు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం,  భూ వివాదాలు, గ్రామ పంచాయతీ కరెంట్‌ బిల్లుల చెల్లింపుపై తహసీల్దార్లు,  పంచాయతీ అధికారులు, ట్రాన్స్‌కో డీఈ, ఏఈలతో మండలా ల వారీగా సమీక్షించారు. 

Updated Date - 2020-06-19T07:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising