జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక
ABN, First Publish Date - 2020-03-15T12:01:08+05:30
మండల కేంద్రంలోని పీహెచ్సీ జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక కావడంతో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్
బొమ్మలరామారం, మార్చి14 : మండల కేంద్రంలోని పీహెచ్సీ జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక కావడంతో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ అండ్ మిషన్తో రూ.2లక్షల రివార్డు పొందిందని ఎంపీపీ సుధీర్రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆరోగ్య శాఖ తరపున నివేదిక వినిపించక ముందే ఈ వార్డు గురించి చర్చించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జూన్ రెండోవారంలో జాతీయ తనిఖీ బృందం మూడు రోజుల పాటు ఆస్పత్రిని సందర్శించి కేంద్ర ప్రభుత్వ నా మ్స్ ప్రకారం నిర్వహిస్తున్న 50రకాల ప్రోగ్రామ్స్, ఆస్పత్రి నిర్వహణపై తనిఖీ చేశారు. తనిఖీ బృందం ఇచ్చిన 80శాతం మార్కులతో 2లక్షల రివార్డు పొందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు గత అక్టోబరు9న ఎంపిక చేసి ప్రకటించారన్నారు. ఈ అవార్డు జిల్లాలో బొమ్మలరామారం మండలంతో పాటు బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో గల ఆరోగ్య కేంద్రాని వచ్చిందని తెలిపారు. రూ.2లక్షలు జిల్లా వైద్యశాఖ ఖాతాలో జమకాగా ఈ రెండు మూడు రోజుల్లో ఆ రోగ్య కేంద్రాల ఖాతాలకు ఇస్తారని వచ్చిన 2లక్షలతో 20శాతం ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బందికి మిగిలిన 80శాతం ఆస్పత్రి మెయింటనెన్స్ ఖర్చులకు ఉపయోగించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Updated Date - 2020-03-15T12:01:08+05:30 IST