భక్తిప్రపత్తులతో పెద్ద హన్మాన్ జయంతి
ABN, First Publish Date - 2020-05-18T09:32:14+05:30
భక్తులకు మనోధై ర్యాన్ని ఇచ్చే దైవంగా కొలిచే ఆంజనేయుని జయంతి ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిప్రపత్తులతో జరు పుకొన్నారు.
నిజామాబాద్ కల్చరల్, మే 17: భక్తులకు మనోధై ర్యాన్ని ఇచ్చే దైవంగా కొలిచే ఆంజనేయుని జయంతి ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిప్రపత్తులతో జరు పుకొన్నారు. ప్రతి యేటా వైశాఖ కృష్ణ దశమి రోజున నిర్వహించే ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆల యాల్లో కొలువుదీరిన ఆంజనేయునికి అభిషేకాలు, అ ర్చనలు, సింధూర సమర్పణ, ఆకు, వడ పూజలు అ ర్చకులు చేశారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా అర్చకులు ఏకాంతంగా పూజాది కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లా కేంద్రంలోని గోల్హనుమాన్, సుభా ష్నగర్ రామాలయం, ఖిల్లా రామాలయం, సలాబత్ పూర్ ఆంజనేయ ఆలయం, నాందేవ్వాడ సాయిసం తోషి ఆలయం, హనుమాన్ ఆలయం, నీలకంఠేశ్వర ప్రాంగణంలోని ఆంజనేయ తదితర ఆలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2020-05-18T09:32:14+05:30 IST