మాదిగల హక్కులను కాలరాస్తున్న బీజేపీ
ABN, First Publish Date - 2020-03-12T11:04:33+05:30
జిల్లా కేంద్రంలోని గొల్లవాడ మారుతినగర్లో నూతనంగా నిర్మించిన సీతారామాంజ నేయస్వామి
మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షడు ధీరన్
ములుగుటౌన్, మార్చి 11: జిల్లా కేంద్రంలోని గొల్లవాడ మారుతినగర్లో నూతనంగా నిర్మించిన సీతారామాంజ నేయస్వామి దేవస్థానంలో విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా కొనసా గుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రెండోరోజు బుధవారం ధ్వజస్తంభ, పంచలోహ ఉత్సవ, రాతి విగ్రహాలతో ములుగు పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. శివాలయంలో భధ్రపరి చిన రాతి విగ్రహాలతోపాటు, ఉత్సవ విగ్రహాలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాలు, ధ్వజ స్తంభాన్ని మూడు ట్రాక్టర్లు, ఎనిమిది ఎడ్ల బండ్లలో కొత్త ఆలయానికి తీసు కువచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు.
శోభా యాత్రలో భాగంగా రహదారి వెంట జై శ్రీరామ్ భక్తులు నినందించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8గంటలకు విగ్రహమూ ర్తులకు కర్మాంగ స్నపనం, మంత్రజప దివ్యప్రబంధ పారాయణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు జరిగే క్షీరా ధివాసంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనా లని తమ ఉత్సవ విగ్రహాలకు పాలతో అభిషే కించి స్వామివారి సేవలో తరించాలని అర్చ కులు సూచించారు. ఈ శోభాయాత్రలో కమిటీ సభ్యులు కొత్తపెల్లి బాబురావు, సుతారి సతీష్, ఒజ్లల లింగన్న, గాదం దేవేందర్, గంధం విజేందర్, మహేం దర్, గొర్రె అంకూస్, బైకాని సాగర్, ఓదెల రమేష్, రాజశేఖర్, అశోక్, ప్రభాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-12T11:04:33+05:30 IST