ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వైఖరి

ABN, First Publish Date - 2020-09-17T08:21:43+05:30

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు విమర్శించారు. దేశంలో నెలకొన్న కొవిడ్‌-19 పరిస్థితిపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజ్యసభలో  టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు

న్యూఢిల్లీ, సెప్టెంబరు16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు విమర్శించారు. దేశంలో నెలకొన్న  కొవిడ్‌-19 పరిస్థితిపై  రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కరోనాను కట్టడి చేసే విషయంలో  కేంద్రం  రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వసనీయతలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ఏకపక్షంగా లాక్‌డౌన్‌ ప్రకటించిందని, ఆ తర్వాత మూడురోజులకు ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడారని, ఇది ఎంతవరకు సబబని  ప్రశ్నించారు. రాష్ర్టాలకు ఇవ్వవలసిన జీఎస్టీ బకాయిలు రూ.8 వేల కోట్లు కేంద్రం నేటికీ ఇవ్వడంలేద ని తెలిపారు. కాగా, ఆయుర్వేద వైద్యంలో విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కేశవరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆయుర్వేదంలో బోధన, పరిశోధనకు సంబంధించిన బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు.  

Updated Date - 2020-09-17T08:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising