విత్తన వేరుశనగ పంపిణీ గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2021-06-21T06:29:36+05:30
జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు.
అనంతపురం వ్యవసాయం, జూన్ 20: జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు. ఇదివరకు వేరుశనగ పంపిణీకి ఆదివారం ఆఖరు రోజుగా వ్యవసాయ శా ఖ ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో లక్ష్యం మేరకు విత్తనకాయల పంపిణీ ముందు కు సాగకపోవడంతో మరికొన్ని రోజులు గ డువు పొడిగించారు. త్వరలో ఆఖరు తేదీని ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో ఆదివారం వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా 2.30 లక్షల మంది రైతులకు 1.97 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేశారు.
Updated Date - 2021-06-21T06:29:36+05:30 IST