ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల పనితీరును పర్యవేక్షించిన చైర్మన

ABN, First Publish Date - 2021-08-10T06:16:33+05:30

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారుల పనితీరును టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు.

స్పందన కార్యక్రమంపై సిబ్బంది పనితీరును ఆరాతీస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి టౌన, ఆగస్టు 9: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారుల పనితీరును టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ప్రజల సమస్యల పట్ల అధికారుల స్పందనపై ఆరాతీశారు. రికార్డుల నిర్వహణ అప్‌డేట్‌గా ఉంచాలన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం చైర్మ న పట్టణంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, పారిశుధ్యం తదితర సమస్యలపై ఆరాతీశారు. పలువురు కాలనీవాసులు అండర్‌డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతోపాటు పలుచోట్ల సిమెంట్‌రోడ్డు వేయాలని చైర్మనకు విన్నవించారు. సమస్యలుంటే ఎప్పటికప్పుడు అధికారులు, కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు చైర్మన సూచించారు. 

Updated Date - 2021-08-10T06:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising