ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటోకాల్‌ అమలేది?

ABN, First Publish Date - 2021-07-12T05:57:59+05:30

మండలంలోని రా యలచెరువు సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేరు మాయమైంది.

శిలాఫలకంలో కనిపించని పంచాయతీ కార్యదర్శి పేరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శిలాఫలకంలో  పంచాయతీ కార్యదర్శి పేరు లేకపోవడంపై విమర్శలు

యాడికి, జూలై 11 : మండలంలోని రా యలచెరువు సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేరు మాయమైంది. ఎమ్మె ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఈ భవనా న్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ఇత ర అధికారుల పేర్లు అన్నీ ఉన్నా, కేవలం పంచాయతీ కార్యదర్శి పేరు లేకపోవడంపై పీఆర్‌ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చే శారన్న ఆరోపణలు పంచాయతీ సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌ ప్రకారం పంచాయతీ కార్యదర్శి పేరు శిలాఫలకంలో ఉండాలి. కానీ ఆ నిబంధన ఎందుకు అమలు చేయలేదని పలువురు   ప్రశ్నిస్తున్నారు. సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో పంచాయతీ కార్యదర్శి పేరు లేకపోవడంపై ఎంపీడీఓ కొండయ్యను వివరణ కోర గా ఇదిమాకు సంబంధం లేని విషయం అని అన్నారు. దీని నిర్వహణ బా ధ్యత అంతా పీఆర్‌ ఇంజనీర్లది అని పేర్కొన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని తెలిపారు.  


Updated Date - 2021-07-12T05:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising