ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి

ABN, First Publish Date - 2021-10-14T05:48:28+05:30

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన బుధవారం శ్రీకాళహస్తిలో జరిగింది.

ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మృతిచెందిన ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, అక్టోబరు 13: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన బుధవారం పట్టణంలో జరిగింది. స్థానిక భాస్కరపేటకు చెందిన రమణమ్మ పాడి ఆవుపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. బుధవారం ఆవు ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి ఆలయం వెనుకున్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మేత మేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. కాగా, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు రెండు ఆవులు విద్యుదాఘాతంతో మృతిచెందాయనీ, దీంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు రమణమ్మ వాపోయింది. అనంతరం ఏఈడీ జయప్రకాష్‌ ఘట నా స్థలానికి చేరుకుని వదులుగా ఉన్న విద్యుత్తు తీగలను సరిచేయించారు. ఏడీ నరసింహులు సిబ్బందితో కలసి ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయించారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-14T05:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising