ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొన్న అంబులెన్సు: బాలిక మృతి

ABN, First Publish Date - 2021-03-22T05:41:59+05:30

అంబులెన్సు లారీని ఢీకొన్న ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో ఆదివారం జరిగింది.

ప్రమాదంలో దెబ్బతిన్న అంబులెన్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, మార్చి 21: అంబులెన్సు ఓ లారీని ఢీకొన్న ఘటనలో ఓ బాలిక మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో ఆదివారం జరిగింది. రూరల్‌ ఎస్‌ఐ ఈశ్వర్‌ కథనం మేరకు... నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నల్లయ్యగారిపాళెంకు చెందిన రమణయ్య  కుమార్తె పద్మ(16) కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతోంది. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున అన్న శ్రీనివాసులు పద్మను అంబులెన్స్‌లో తిరుపతి రుయాస్పత్రికి తరలించేయత్నం చేశారు. శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లె వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అంబులెన్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ చికిత్స నిమిత్తం నెల్లూరు వెళ్లిపోయారు. ఈ ఘటనలో స్ట్రెక్చర్‌ నుంచి కిందపడిన బాలికను మరో అంబులెన్సులో రుయాకు తరలించగా అప్పటికే పద్మ మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-22T05:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising