రైల్వేలో ప్రైవేటీకరణ తగదు: ఈఎస్ డిమాండ్
ABN, First Publish Date - 2021-09-19T05:38:51+05:30
రైల్వే ప్రైవేటీకరణ తగదని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్ డివిజన్ సెక్రటరీ పి.బాబు డిమాండ్ చేశారు.
రేణిగుంట, సెప్టెంబరు 18: రైల్వే ప్రైవేటీకరణ తగదని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్ డివిజన్ సెక్రటరీ పి.బాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్లో సంఘ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేశాఖలోని పలు విభాగాలను కార్పొరేటర్లకు అప్పగించే కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇప్పటికే 150 రైళ్లు, 7,352 రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడతామని ఎన్నికల ముందు చేసిన హామీలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరంచేసేందుకు చర్యలు చేపట్టిందని వాపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ గాలికి వదిలేసిందని విమర్శించారు. రైల్వే ఉద్యోగులకు సకాలంలో డీఏలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వేదమూర్తి, ఎన్సీఎంరెడ్డి, సుబ్బారావు, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-19T05:38:51+05:30 IST