ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి బస్టాండులో రూ.60 లక్షలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-11-02T07:14:09+05:30

తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు అనుమానితుల నుంచి పోలీసులు రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన డబ్బు చూపుతూ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు


తిరుపతి(నేరవిభాగం), నవంబరు 1: తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు అనుమానితుల నుంచి పోలీసులు రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన ప్రకారం.. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, సిబ్బందితో కలిసి డీఎస్పీ సోమవారం రాత్రి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండులో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన మురళి, భూపతిని తనిఖీ చేయగా వారి వద్ద రూ.60 లక్షలు లభ్యమయ్యాయి. తాము కొర్లగుంట వీధిలోని కామాక్షి నగల దుకాణంలో పనిచేస్తున్నామని, చెన్నైలో నగలు కొనేందుకు నగదు తీసుకెళ్తున్నట్టు వారు చెప్పారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. మురళి, భూపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-11-02T07:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising