ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరపలో నాలుగు పంచాయతీలు పూర్తి ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-02-05T06:32:24+05:30

కరప మండలంలో పెనుగుదురు, గురజనాపల్లి, వేములవాడ, కొంగోడు గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, ఫిబ్రవరి 4: కరప మండలంలో పెనుగుదురు, గురజనాపల్లి, వేములవాడ, కొంగోడు గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలిపారు. గురజనాపల్లి, వేములవాడ పంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్‌ పడగా, పెనుగుదురు, కొంగోడు గ్రామాల్లోని వార్డులకు పలు నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు చివరిరోజున ఆయా స్థానాలకు ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో నిలిచారు. దీంతో ఆ నాలుగు పంచాయతీల ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నాలుగు సర్పంచ్‌ స్థానాలు వైసీపీ ఖాతాలోకి చేరాయి. గురజనాపల్లిలో 12 వార్డులను పొత్తుల్లో భాగంగా వైసీపీ, టీడీపీ, జననసేన పార్టీలు సమానంగా పంచుకున్నాయి. వైస్‌సర్పంచ్‌ పదవిని జనసేన బలపరిచిన వార్డుసభ్యుడికి కేటాయించారు. పెనుగుదురులో 12 వార్డుల్లో రెండింటిని జనసేన పార్టీ తరపున పోటీలో నిలిచిన అభ్యర్థులకు కేటాయించారు. వేములవాడలోని 12 వార్డులు, కొంగోడులోని 10వార్డులు వైసీపీ బలపరిచిన అభ్యర్థులే దక్కించుకోవడం విశేషం.

Updated Date - 2021-02-05T06:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising