ప్రశాంతంగా ఇంటర్ అర్ధ సంవత్సర పరీక్షలు
ABN, First Publish Date - 2021-12-28T05:35:30+05:30
సామర్లకోట, డిసెంబరు 27: ఇంటర్ విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సర పరీక్షలకు సామర్లకోట జూనియర్ కళాశాల పరిధిలో 347 మంది విద్యార్థులకు గాను 303 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 316మందికి 222మంది హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ టీ.శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్ర భుత్వ
సామర్లకోట, డిసెంబరు 27: ఇంటర్ విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సర పరీక్షలకు సామర్లకోట జూనియర్ కళాశాల పరిధిలో 347 మంది విద్యార్థులకు గాను 303 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 316మందికి 222మంది హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ టీ.శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్ర భుత్వ, ప్రయివేట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 106550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారని ఇంటర్ ఆర్ఐవో శారద తెలిపారు. పరీక్షలకు విద్యార్థులు వారు చదివే కళాశాల్లోనే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు.
Updated Date - 2021-12-28T05:35:30+05:30 IST