రమాబాయి అంబేడ్కర్ ఆదర్శప్రాయురాలు
ABN, First Publish Date - 2021-02-08T06:03:22+05:30
మహిళ లోకానికి రమాబాయి అంబేడ్కర్ ఆదర్శనీయమని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ బి.ప్రసాదరావు అన్నారు.
- ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ప్రసాదరావు
- ఘనంగా బీఆర్ అంబేద్కర్ సతీమణి జయంతి
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 7: మహిళ లోకానికి రమాబాయి అంబేడ్కర్ ఆదర్శనీయమని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ బి.ప్రసాదరావు అన్నారు. రమాబాయి అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తన జాతి జనుల కోసం పోరాటం చేస్తున్న అంబేడ్కర్కు ఆయన భార్య రమాబాయి చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. సభాధ్యక్షుడు మర్రి బాబ్జి మాట్లాడుతూ భర్త చేస్తున్న ఉద్యమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించిన మహనీయురాలు రమాబాయి అని కొనియాడారు. కార్యక్రమంలో సీహెచ్ సుబ్బారావు, నయనాల కృష్ణారావు, డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, తిలక్కుమార్ , కోరుకొండ చిరంజీవి, డాక్టర్ చైతన్యశేఖర్, వైరాల అప్పారావు, అడిషనల్ డిఎంఅండ్హెచ్వో డాక్టర్ కోమల, కవి గూటం స్వామి పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు 48వ డివిజన్లో రమాబాయి చిత్రపటానికి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నూనె వేణుయాదవ్, రేబాక అబ్బులు, ఆదిరెడ్డి చిన్నా, బంటి హరీష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-02-08T06:03:22+05:30 IST