దళితులపై దాడులు అరికట్టాలి
ABN, First Publish Date - 2021-08-20T06:37:01+05:30
దళితులపై దాడులు అరికట్టి, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో కోనసీమ దళిత ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో గురువారం ఎస్పీ రవీంద్రనాథ్బాబుకు వినతిపత్రం అందజేశారు.
అమలాపురం రూరల్, ఆగస్టు 19: దళితులపై దాడులు అరికట్టి, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో కోనసీమ దళిత ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో గురువారం ఎస్పీ రవీంద్రనాథ్బాబుకు వినతిపత్రం అందజేశారు. మాచవరంలో దళిత మహిళపై జరిగిన దాడిపై దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ, అంబాజీ పేట ఎస్ఐలను సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం ఆయ నకు అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ప్రజాసం ఘాల నాయకులు జంగా బాబూరావు, డీబీ లోక్, మోకాటి నాగేశ్వరరావు, రేవు తిరుపతిరావు, బీర రాజారావు, పిల్లి సత్యవతి, పిల్లి శ్రీదుర్గ, నాగవరపు అన్నవరం పాల్గొన్నారు.
Updated Date - 2021-08-20T06:37:01+05:30 IST