ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరువు పోయిందని.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-10-07T06:00:56+05:30

వేధింపులు తాళలేక, మరో వైపున కుటుంబం పరువు పోయిందని భార్యాభర్తలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికిత్స పొందుతూ భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

మలాపురం టౌన్‌, అక్టోబరు 6:  వేధింపులు తాళలేక, మరో వైపున కుటుంబం పరువు  పోయిందని   భార్యాభర్తలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈకేసుకు సంబంఽ దించిన వివరాలను పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలి పారు. అమలాపురం రవణంమల్లవీధిలో పలచోళ్ల సూర్యకొం డలరావు, సంధ్యాకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. కొండలరావు ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఆ వీధిలోనే నివాసం ఉంటున్న గండు సుబ్బారావుతో  గతంలో సంధ్యా కుమారి ఫోన్‌లో మాట్లాడింది. ఈనేపథ్యంలో తనతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు, వాయిస్‌ మెస్సేజ్‌లను బయట పెడతానని  సుబ్బారావు సంధ్యాకుమారిని  బెదిరించడంతో పాటు రూ.4లక్షలు డిమాండు చేశాడు. దీంతో సంధ్యాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెస్సేజ్‌లు బయటపెడతాడని భయపడి రూ.40వేలు చెల్లించినట్టు పేర్కొంది. అయితే ఈవ్యవహారంపై స్థానిక పెద్దలు పంచా యతీ నిర్వహించారు. కుటుంబ పరువు పోయిందని కొండల రావు భావించాడు. దీంతో ఈనెల4వతేదీ సాయంత్రం భార్య సంధ్యాకుమారితో కలసి బోడసకుర్రు వంతెన వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పురుగుల మందును  భార్యా భర్తలిద్దరూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని స్థానికులు అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పలచోళ్ల సూర్య కొండలరావు(45) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. సంధ్యాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా సంధ్యాకుమారి వల్ల తన కుటుంబం పరువు పోయిందని గండు సుబ్బారావు భార్య నాగలక్ష్మి ఈనెల4న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ముగ్గురిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.



Updated Date - 2021-10-07T06:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising