Guntur: కొత్తపేటలో నలుగురు మైనర్లు అదృశ్యం
ABN, First Publish Date - 2021-08-27T14:54:43+05:30
జిల్లాలోని కొత్తపేటలో నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన కలకల రేపుతోంది. గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వారు తిరిగి రాలేదు. అదృశ్యమైన నలుగురిలో ఇద్దరు బాలురు
గుంటూరు: జిల్లాలోని కొత్తపేటలో నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన కలకల రేపుతోంది. గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వారు తిరిగి రాలేదు. అదృశ్యమైన నలుగురిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. అయితే..ఇంటి నుంచి బయటకు వెళ్లిన నలుగురు చీకటి పడుతున్న ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి పరసరాల్లో వెతికిన ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులు వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-08-27T14:54:43+05:30 IST