బీసీలపై బీజేపీ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలి
ABN, First Publish Date - 2021-12-19T05:41:58+05:30
బీసీల కుల గణన వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే బీజేపీకి గుణపాఠం తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.
ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
గుంటూరు, డిసెంబరు 18: బీసీల కుల గణన వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే బీజేపీకి గుణపాఠం తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరులోని సంఘ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనగణనలో ఓబీసీ కుల గణనని తరస్కరిస్తూ పార్లమెంటులో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ ప్రకటించటం బీసీలను వంచించడమేనన్నారు. బీజేపీ తన ఆధిపత్య కుల స్వభావాన్ని ఓబీసీ వ్యతిరేక దురహంకారాన్ని మరింతగా బహిర్గతం చేసుకుంటోందని మండిపడ్డారు. బీసీలు సమైక్యంగా ఉద్యమించి లక్ష్యాన్ని సాధించుకుంటారన్నారు. సమావేశంలో సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్, తన్నీరు ఆంజనేయులు, కోలా అశోక్, కొల్లికొండ వెంకటసుబ్రమణ్యం, గోపికృష్ణ, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-19T05:41:58+05:30 IST