ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబళించిన కెరటాలు

ABN, First Publish Date - 2021-03-22T05:50:01+05:30

కడలి కెరటాలు ఇద్దరు విద్యార్థులను కబళించాయి. మరొకరిని గల్లంతు చేశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కఠారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

భరత్‌రెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్రంలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతి 

మరొకరు గల్లంతు

అంతా గుంటూరు జిల్లాకు చెందినవారు

ప్రకాశం జిల్లాలో ఘటన 

చీరాల టౌన్‌, మార్చి 21 : కడలి కెరటాలు ఇద్దరు విద్యార్థులను కబళించాయి. మరొకరిని గల్లంతు చేశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కఠారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన ఉష(19), భరత్‌రెడ్డి(20), మహేష్‌, యశ్వంత్‌, హిమశ్రీ గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరంతా ఆదివారం మధ్యాహ్నం కఠారిపాలెం సముద్రతీరానికి వచ్చారు. సరదాగా లోపలికి దిగారు. కొద్దిసేపటి తర్వాత అలల తాకిడికి ఉష, భరత్‌, మహేష్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయారు. కొంత సమయానికి ఉష, భరత్‌ మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేష్‌ గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు పోలీసులు గాలిస్తున్నారు. ఉష, భరత్‌రెడ్డి మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 



Updated Date - 2021-03-22T05:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising