ప్రయాణికుల ఆదరణ లేని రైళ్ల రద్దు
ABN, First Publish Date - 2021-05-02T05:45:43+05:30
కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న కొన్ని రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
గుంటూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న కొన్ని రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. గుంటూరు - వికారాబాద్ - గుంటూరు పల్నాడు స్పెషల్ ఎక్స్ప్రెస్ని ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. రేపల్లె - కాచీగూడ - రేపల్లె డెల్టా స్పెషల్ ఎక్స్ప్రెస్ని ఈ నెల 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు రద్దు చేశారు. అలానే గుంటూరు - కాచీగూడ - గుంటూరు వయా నంద్యాల స్పెషల్ ఎక్స్ప్రెస్ని కూడా నెలాఖరు వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్ - విశాఖపట్టణం - సికింద్రాబాద్ వయా గుంటూరు ఏసీ ఎక్స్ప్రెస్ని ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు.
Updated Date - 2021-05-02T05:45:43+05:30 IST