గజ.. గజ
ABN, First Publish Date - 2021-12-19T05:42:10+05:30
నాలుగు రోజుల నుంచి జిల్లాలో చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
రాత్రి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు..
వణికిపోతున్న జిల్లావాసులు
గుంటూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజుల నుంచి జిల్లాలో చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ నమో దవుతుండగా రాత్రివేళ అవి మరింత కనిష్టస్థాయికి చేరు కుంటున్నాయి. రెండు, మూడురోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 16 -15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో జిల్లావాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురువడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని, దీని కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగానే ఉం టుందని వాతావరణశాఖ తెలిపింది. రాత్రిళ్లు ఉద్యో గాలు, వ్యాపారాలు చేసేవారు చలికి వణు కుతు న్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జాగ్రత్తలు తీసు కోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
నాలుగు రోజుల నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రత్తలు
రాత్రి - పగలు
బుధవారం 19.2 - 29.6
గురువారం 18.2 - 29.4
శుక్రవారం 16.2 - 29.6
శనివారం 16.3 - 29.2
Updated Date - 2021-12-19T05:42:10+05:30 IST