ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో భర్త.. బాధతో భార్య మృతి

ABN, First Publish Date - 2021-06-22T08:44:29+05:30

కరోనాతో భర్త మృతి చెందగా.. ఆయన మరణ వార్తను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో చోటు చేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, జూన్‌ 21: కరోనాతో భర్త మృతి చెందగా.. ఆయన మరణ వార్తను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో చోటు చేసుకుంది. సత్యవేడుకు చెందిన నాగేశ్వరరావు (71) కరోనా సోకడంతో పదిరోజులుగా సత్యవేడు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన మృతి చెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య మునీంద్ర (56) కూడా బీపీ ఎక్కువై సోమవారం మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

Updated Date - 2021-06-22T08:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising