ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని తరలిస్తే సీమకే అన్యాయం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-12-19T08:45:03+05:30

రాజధాని తరలిస్తే సీమకే అన్యాయం: తులసిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, డిసెంబరు 18: అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ వాసులేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శనివారం కడప జిల్లా వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఉన్న సచివాలయానికి వెళ్లాలంటేనే రాయలసీమ వాసులకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుందని తెలిపారు. ఇక విశాఖకు తరలిస్తే సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు మరింత దూరమవుతుందన్నారు. విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణించే పెద్ద నాయకులకు, కుబేరులకు ఇబ్బంది ఉండకపోవచ్చునని, సాధారణ ప్రజానీకానికి సమస్యలు ఉంటాయన్నారు. వికేంద్రీకరణ బిల్లు లేకుండానే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు బదిలీచేసి అధికార వికేంద్రీకరణ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా, పరిశ్రమలు, ప్యాకేజీలో ప్రకటించిన విధంగా నిధులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు. 

Updated Date - 2021-12-19T08:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising