ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిపై కత్తులతో దాడి

ABN, First Publish Date - 2021-08-11T05:04:30+05:30

కడప నగరం కందిపాలెంకు చెందిన దేవతల ప్రశాంత్‌పై మేరీ నగర్‌, ఇందిరానగర్‌కు చెందిన 15 మంది కత్తులతో దాడి చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 మందిపై కేసు నమోదు 

కడప(కైం), ఆగస్టు 10: కడప నగరం కందిపాలెంకు చెందిన దేవతల ప్రశాంత్‌పై మేరీ నగర్‌, ఇందిరానగర్‌కు చెందిన 15 మంది కత్తులతో దాడి చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ప్రశాంత్‌ అన్న సుశాంత్‌ జడ్పీ ఆఫీ సులో పనిచేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఇందిరా నగర్‌కు చెందిన చాన్‌, సుశాంత్‌కు ఫోన్‌ చేసి తెలుగు గంగ కాలనీకి పిలిపించి అక్కడ దాడి చేసేందుకు యత్నించాడు. అంతలోనే అక్కడికి సోదరుడు ప్రశాంత్‌ వెళ్లడంతో ఇద్దరిపై దాడి చేశారు. అనంతరం ఈ నెల 8న ఎర్రముక్కపల్లె వద్ద ప్రశాంత్‌ ఉండగా, కాపు కాచి చిన్న, సంజయ్‌, సుజన్‌, దిలీప్‌, నాని, సర్దార్‌ మరికొందరితో కలిసి కత్తులతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ప్రశాంత్‌ను రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-08-11T05:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising