చట్టాలపై అవగాహన అవసరం
ABN, First Publish Date - 2021-11-10T04:58:50+05:30
జాతీయ న్యాయ సేవాదినోత్సం సందర్భంగా మంగళవారం మైదకూరులో జడ్జి రాధారాణి ఆధ్వర్యంలో అధికారులు, న్యాయవాదుల చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మైదుకూరు, నవంబరు 9 : జాతీయ న్యాయ సేవాదినోత్సం సందర్భంగా మంగళవారం మైదకూరులో జడ్జి రాధారాణి ఆధ్వర్యంలో అధికారులు, న్యాయవాదుల చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు ఆవరణం నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాదారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు, కార్యదర్శులు మాదం మునిరత్నం, శ్రీనివాసులు, సభ్యులు దాసరి బాబు, రామిశెట్టి శ్రీనివాసులు, ఆవుల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-10T04:58:50+05:30 IST